Friday, May 3, 2024

మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడం లేదు.. కేటీఆర్

మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ… శత్రుదేశంపై పగబట్టినట్లు తెలంగాణపై కేంద్రం కక్ష గట్టిందన్నారు. ప్రతిపాదనలు పంపినా కనీసం కనీసం స్పందించడం లేదన్నారు. మిగిలిన పట్టణాల్లో మాత్రం కేంద్రం మెట్రోకు నిధులిస్తోందన్నారు. వడ్డించేవాళ్లు మనవాళ్లయితే అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. వాళ్ల రాష్ట్రాల్లోని మెట్రోలకే నిధులిస్తోందన్నారు. మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రోను పొడిగిస్తామన్నారు. కాంగ్రెస్ కు 50ఏళ్లు అధికారం ఇస్తే ఏం చేసిందని ప్రశ్నించారు. 9 నెలల్లో అధికారంలోకి వచ్చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారన్నారు. 9 నెలల్లో పిల్లలు వస్తారు.. మీరు అధికారంలోకి రారని కేటీఆర్ సెటైర్ వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement