Sunday, May 5, 2024

యాసంగి వ‌డ్ల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌.. నేరుగా ఎఫ్‌సీఐ కొంట‌ద‌న్న మంత్రులు

తెలంగాణ‌లో యాసంగి ధాన్యం కొనుగోళ్ల‌పై ప్ర‌తిష్ఠంభ‌న తొల‌గించే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం ఇవ్వాల‌ నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో ధాన్యం సేక‌ర‌ణ‌కు భార‌త ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు బుధ‌వారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రులు పీయూష్ గోయ‌ల్‌, కిష‌న్ రెడ్డి ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ‌లో పండిన ధాన్యం సేక‌ర‌ణ‌లో జాప్యం కార‌ణంగా రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌న్న కేంద్ర మంత్రులు… నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని సేక‌రించేందుకు ఎఫ్‌సీఐకి ఆదేశాలు జారీ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యంతో పాటు బియ్యాన్ని కూడా సేక‌రించేందుకు త్వ‌ర‌లోనే ఎఫ్‌సీఐ రంగంలోకి దిగుతుంద‌ని ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement