Friday, April 26, 2024

Breaking: లాలూ ప్రసాద్ యాదవ్ పై సీబీఐ కొత్త కేసు

బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ పై సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. దాణా కుంభకోణంలో కొద్ది వారాల కిందట లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించిన ఆనందం అంతలోనే ఆవిరయ్యింది. ఆయనపై తాజాగా సీబీఐ మరో కేసు నమోదు చేసింది. 2004 నుంచి 2009 వరకు కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాల భర్తీలో అవకతకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ లాలూ ప్రసాద్, ఆయన కుటుంబసభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement