Saturday, May 18, 2024

ర‌యీస్ చిత్రం కేసులో – షారుక్ ఖాన్ కి ఊర‌ట‌

ర‌యీస్ చిత్రం కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కి ఊర‌ట ల‌భించింది. వడోదర రైల్వే స్టేషన్‌లో 2017లో జరిగిన ‘రయీస్’ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించడంతో మృతుడి కుటుంబ సభ్యులు షారూఖ్ ఖాన్‌ పై కేసు నమోదు చేశారు. తనపై ఉన్న క్రిమినల్ కేసును, దిగువ కోర్టు తనపై జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ షారుఖ్ ఖాన్ చేసిన విజ్ఞప్తిని ఆలకించారు జస్టిస్ నిఖిల్ కరీల్. అప్పట్లో షారుఖ్ పై దాఖలైన ఈ క్రిమినల్ కేసును గుజరాత్ హైకోర్టు రద్దు చేసింది. ఈ ఘటనతో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తి ఖాన్‌పై ఫిర్యాదు చేశారని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. షారుఖ్ ఖాన్ జనాలను ఉత్తేజపరచడానికే ఆలా చేసి ఉండొచ్చు. అంతేకానీ అది నిర్లక్ష్యంతో చేసిన పని కాదు. షారుఖ్ తన సినిమా ప్రమోషన్ గురించే అలా చేశాడు. అందులో ఎలాంటి దురుద్దేశం లేదని అర్థమవుతోంది అంటూ న్యాయమూర్తి స్టార్ హీరోకు అనుగుణంగా తుది తీర్పును ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement