Wednesday, April 17, 2024

Breaking : మ‌రియ‌మ్మ లాక్ అప్ డెత్ కేసుపై సందిగ్థంలో తెలంగాణ హైకోర్టు..ఏం జ‌ర‌గ‌నుంది..!

అడ్డ‌గూడూరు మ‌రియ‌మ్మ లాక‌ప్ డెత్ కేసుపై టీఎస్ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. మ‌రియ‌మ్మ మృతిపై గ‌తంలో హైకోర్టుకు నివేదిక స‌మ‌ర్పించింది మెజిస్ట్రేట్. సీబీఐకి అప్ప‌గించే అంశంపై తీర్పుని రిజ‌ర్వ్ చేసింది హైకోర్టు. టీఎస్ హైకోర్టుకు హాజ‌రైయ్యారు రాచ‌కొండ సీపీ మ‌హేష్ భ‌గ‌వ‌త్. హైకోర్టుకు సీబీఐ ఎస్పీ,ఐబీ అధికారి హాజ‌ర‌య్యారు. ఈ కేసులో బాధ్యులైన ఇద్ద‌రు పోలీస్ అధికారుల‌ను విధుల నుంచి తొల‌గించామ‌ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ తెలిపింది. కాగా ఈ కేసును సీబీఐకి అప్ప‌గిస్తే తెలంగాణ పోలీసుల‌పై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం స‌న్న‌గిల్లే అవ‌కాశం ఉంద‌ని ఏజీ తెలిపింది. దాంతో మ‌రియ‌మ్మ లాక్ అప్ డెత్ కేసును సీబీఐకి అప్ప‌గించాలా..వ‌ద్దా అనే అంశంపై తీర్పును రిజ‌ర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement