Friday, May 3, 2024

Breaking : పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థిగా చ‌ర‌ణ్ జీత్ సింగ్ చ‌న్నీ – సిద్దూకు మొండిచేయి

పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి పేరుని ప్ర‌క‌టించారు రాహుల్ గాంధీ. రాబోయే ఎల‌క్ష‌న్ లో సీఎం చ‌ర‌ణ్ జీత్ సింగ్ చ‌న్నీనే సీఎం అభ్య‌ర్థిగా ఖ‌రారు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. లూథియానాలో జరుగుతున్న కాంగ్రెస్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ వెల్లడించారు.అయితే ముఖ్యమంత్రి స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నవజ్యోత్ సిద్దూకు మొండిచేయి చూపించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇటీవల ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఎప్పుడూ కూడా బలహీన సీఎంలనే కోరుకుంటుందని ఇటీవల సిద్దూ వ్యాఖ్యలు చేశారు.

గతంలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రజలు నిర్ణయిస్తారు అధిష్టానం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే ఆప్ తన సీఎం అభ్యర్థిగా భగవంత్ సింగ్ మాన్ పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 5 రాష్ట్రాల ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ లో జరుగనున్న ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలకు సెమిఫైనల్స్ గా పరిగణిస్తున్నాయి రాజకీయ పార్టీలు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement