Thursday, April 25, 2024

బీజేపీకి అధికారం.. కేసీఆర్ కు విశ్రాంతి అవసరం.. జేపీ నడ్డా..

బీజేపీకి అధికారం.. కేసీఆర్ కు విశ్రాంతి అవసరమని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కరీంనగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంపై కేసీఆర్ కు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. మోడీ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందన్నారు. కేసీఆర్ సర్కారు మాత్రం అవినీతిలో మునిగి తేలుతోందన్నారు. కేంద్ర కేబినెట్ లో బీసీ, ఎస్సీలకు న్యాయం చేశామన్నారు. తెలంగాణలో కేంద్ర నిధులతో 5వేల కిలోమీటర్ల రోడ్లు వేశామన్నారు. ఒకప్పుడు ధనిక రాష్ట్రమైన తెలంగాణ… ఇప్పుడు అప్పులపాలైందన్నారు. కేసీఆర్ తీరు ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరినట్లుగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement