Friday, May 17, 2024

మ‌ణిపూర్ లో 60నియోజ‌క‌వ‌ర్గాల్లో బిజెపి పోటీ – 60మంది అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌

మ‌ణిపూర్ లో మ‌ళ్ళీ తామే అధికారంలోకి వ‌స్తామ‌ని కేంద్ర మంత్రి భేపేంద‌ర్ యాద‌వ్ ధీమా వ్య‌క్తం చేశారు. ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు విడతల్లో మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో మ‌ణిపూర్ లో ఒంట‌రిగానే పోటీ చేయాల‌ని బిజెపి నిర్ణ‌యించింది. కాగా మొత్తం 60నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీకి దిగేందుకు నిర్ణ‌యించుకుంది. దాంతో నేడు 60మంది అభ్య‌ర్థుల‌ను ప్రక‌టించింది. కాగా రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్, త‌న సిట్టింగ్ స్థానం హేంగాంగ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచే బ‌రిలోకి దిగ‌నున్నారు. బిజెపి హయాంలోనే మణిపూర్ ప్రశాంతంగా ఉందని, అభివృద్ధి జరుగుతోందని భూపేందర్ యాదవ్ తెలిపారు. దీర్ఘకాలంపాటు బిజెపి కోసం పనిచేసిన వారికే టికెట్ ఇచ్చామని చెప్పారు. క్రీడలు, అధికారులు, విద్యావేత్తలకూ టికెట్లు ఇచ్చామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement