Sunday, May 5, 2024

కరోనా విళయతాడవం ఒక్కరోజులోనే 81 వేల కేసులు

దేశ వ్యాప్తంగా అత్యధిక స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గతంలో కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో నమోదైనన్ని కేసులు తిరిగి తాజాగా నమోదవుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 81,466 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,03,131కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 469 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,63,396కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,15,25,039 మంది కోలుకున్నారు. 6,14,696 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement