Friday, May 3, 2024

2nd Test: 262 పరుగులకు భార‌త్ ఆలౌట్

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు మొద‌టి ఇన్నింగ్స్ 262 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. భార‌త్ బ్యాట్స్ మెన్లు అక్ష‌ర్ ప‌టేల్ 74 ప‌రుగులు, విరాట్ కోహ్లీ 44 ప‌రుగులు, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 37 ప‌రుగులు, రోహిత్ శ‌ర్మ 32 ప‌రుగులు చేశారు. ఆసీస్ బౌల‌ర్లు ల‌యాన్ 5 వికెట్లు తీయ‌గా, మ‌ర్ఫీ రెండు వికెట్లు, కుహ్నెమ‌న్ రెండు వికెట్లు, క‌మ్మిన్స్ ఒక వికెట్ తీశారు. ఆసీస్ మొద‌టి ఇన్నింగ్స్ 263 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే. దీంతో ఇండియా ఒక్క పరుగు వెనుకంజలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement