Saturday, April 27, 2024

ప్రధాని మోడీకి 200 మంది మెదక్ చిన్నారుల లెటర్స్.. ఏం రాశారంటే..

ప్రధాని న‌రేంద్ర మోడీకి 200 ఉత్తరాలు రాశారు 200 మంది మెద‌క్ చిన్నారులు. తాము చదవుకునేందుకు మెదక్ జిల్లాలో ఓ నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని వారు ఆ లెటర్లలో కోరారు. త‌మ‌ జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నవోదయ స్కూల్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంద‌ని పేర్కొన్నారు.

మెదక్ జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఉంటే త‌మ జీవితాలు బాగుప‌డుతాయ‌ని రాసిన లేఖల్లో పేర్కొన్నారు. సుమారు 200 మంది విద్యార్థులంతా క‌లిసి పోస్టు కార్డు ద్వారా ప్రధానికి ఈ విజ్ఞప్తి చేశారు. కాగా, న‌వోద‌య పాఠ‌శాల‌లు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాల‌ని చాలా కాలంగా డిమాండ్ ఉన్న విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement