Friday, May 3, 2024

కొత్త‌గా 1,272క‌రోనా కేసులు.. ముగ్గురు మృతి

కొత్త‌గా 1,272క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ముగ్గురు మృతి చెందారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1272 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,49,80,674 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 15,515 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 87.06 శాతంగా ఉంది.ఇక దేశంలో 03 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,31,770 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2252 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,44,33,389 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,20,66,91,692 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 1,24,628 మందికి కరోనా పరీక్షలు చేసింది ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement