Sunday, May 19, 2024

U19 WC | ఉత్కంఠ పోరులో విజయం.. ఫైనల్స్‌కు యంగ్ ఇండియా !

అండర్ 19 ప్రపంచకప్ 2024లో భాగంగా సౌతాఫ్రికాతో జరగిన సెమీఫైన్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ 2 వికెట్లతో గెలుపొంది ఫైనల్స్‌కు దూసుకెళ్లింది యంగ్ ఇండియా. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు 7 వికెట్లకు 244 పరుగులు చేసి భరత్ ముందు భారీ స్కోర్‌‌ను సెట్ చేసింది.

చేజింగ్‌కు దిగిన భారత్ జట్టును కప్టెన్ ఉదయ్ సహారన్, సచిన్ దాస్ ఆదుకున్నారు. ఆదిలోనే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో సచిన్ దాస్ (96) ప‌రుగులు చేసి 43వ ఓవర్లో అవుట్ అయ్యి సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక ఉదయ్ సహారన్ (81) పరుగులతో హాప్ సెంచరీతో అదరకొట్టాడు. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టుగా దూసుకెళ్తోంది. సెమీస్ చేరే క్రమంలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ యువ భారత్ విజయం సాధించింది.

ఇక ఈ టోర్నీలోని రెండో సెమీఫైనల్ మ్యాచ్‌ రేపు ( ఫిబ్రవరి 7న) జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement