Monday, April 29, 2024

Big Breaking | చివరిదాకా ఆఫ్గానిస్తాన్​ పోరాటం.. భారత్​ టార్గెట్​ ఎంతంటే!

వన్డే వరల్డ్​ కప్​లో భాగంగా ఇవ్వాల భారత్​, ఆప్ఘాన్​ జట్ల మధ్య మ్యాచ్​ జరుగుతోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న 9వ మ్యాచ్​లో తొలుత ఆఫ్గాన్​ బ్యాటింగ్​ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో ఆఫ్గాన్​ జట్టు 8 వికెట్లు నష్టపోయి, 272 పరుగులు చేసింది. అయితే.. భారత క్రికెట్​ అభిమానులు అంచనా వేసినట్టు ఆఫ్గాన్​ జట్టు అంత తీసిపోయినట్టు కనిపించలేదు. 100 పరుగుల లోపు ఆలౌట్​ అవుతారనుకున్న ఆఫ్గాన్​ బ్యాటర్లు భారత్​తో చివరి ఓవర్ల దాకా గట్టి పోరాటమే చేశారు. ఇక.. భారత్​ 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగాల్సి ఉంది..

ఇక.. ఈ మ్యాచ్​లో గుర్బాజ్​ (21), జద్రాన్​ (22), రహ్మత్​ షా (16), హస్మతుల్లా షాహిదీ (80), అజ్మతుల్లా (62), నబి (19) నజీబుల్లా (2) పరుగులు చేశారు. ఇక.. చివరి ఓవర్లలో రశీద్​ఖాన్ (16)​ మెరుపులు మెరిపించి క్రికెట్​ అభిమానులను అలరించాడు.

భారత బౌలర్లలో బుమ్రా 4, హార్దిక్​ పాండ్యా 2 వికెట్లు తీయగా.. శార్దూల్​, కుల్దీప్​ తలా ఒక వికెట్​ పడగొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement