Saturday, May 18, 2024

WTC | టీమిండియా నెం.1

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2023-25లో టీమిండియా మళ్ళీ నెంబర్‌-1 స్థానానికి దూసుకొచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఘోర ఓటమిపాలైంది. దాంతో ఆ మ్యాచ్‌కి ముందు వరకు అగ్రస్థానంలో కొనసాగుతున్న కివీస్‌ రెండో స్థానానికి పడిపోయింది. ఇక ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు తమ విజయాల శాతాన్ని మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం భాతర్‌ 64.58 విజయాల శాతంతో అగ్రస్థానాకి దూసుకెళ్లింది.

అలాగే ఆసీస్‌ చేతిలో ఓడిన న్యూజిలాండ్‌ 60 శాతంతో రెండో స్థానానికి పడిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన కంగారూ జట్టు 59.09 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌ (50)తో నాలుగో స్థానం దక్కించుకోగా.. పాకిస్తాన్‌ (36.66)తో ఐదో స్థానంలో నిలిచింది. ఇక వచ్చే ఏడాది మార్చి 2025లోగా టాప్‌-2 స్థానాల్లో నిలిచే జట్లు ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఇప్పటికే వరుసగా రెండు సార్లు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు అర్హత సాధించిన టీమిండియా హ్యాట్రిక్‌పై కన్నేసింది.

మొదటి రెండు స్థానాల కోసం భారత్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. మార్చి 7 నుంచి భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది. మార్చి 8 నుంచి ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో టెస్టు జరుగునుంది. ఆ తర్వాత వరుసగా ఐపీఎల్‌, టీ20 ప్రపంచకప్‌ టోర్నీలు ఉండటంతో ఈ నాలుగు జట్లకు కొన్ని నెలలపాటు అంతర్జాతీయ టెస్టుల నుంచి బ్రేక్‌ లభించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement