Sunday, May 19, 2024

సింగిల్స్‌లో సింధు శుభారంభం.. ప‌సిడి ప‌త‌కం తెచ్చేనా!

టీమ్‌ ఈవెంట్‌లో రజతంతో సరిపెట్టుకున్న భారత షట్లర్లు.. ఇక వ్యక్తిగత విభాగంలో పతకాలు కొల్లగొట్టేందుకు రెడీ అయ్యారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేసి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు.

నిన్న (గురువారం) తొలి రౌండ్‌లో సింధు 21-4, 21-11తో ఫాతిమా నభా (మాల్దీవులు)పై ఏకపక్ష విజయం సాధించగా.. పురుషుల విభాగంలో శ్రీకాంత్‌ 21-9, 21-9తో డానియల్‌ (ఉగాండా)పై గెలుపొందాడు. గోల్డ్‌కోస్ట్‌ (2018) కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం దక్కించుకున్న సింధుకు ప్రత్యర్థి నుంచి ఏమాత్రం పోటీ ఎదురుకాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement