Tuesday, May 21, 2024

China Open | సాత్విక్‌ జోడీ ఔట్‌.. ముగిసిన భారత్‌ పోరాటం

చైనా ఓపెన్‌ బ్యాట్మింటన్‌ సూపర్‌-1000 టోర్నీలో భారత్‌ పోరాటం ముగిసింది. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌ నుంచి హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, లక్ష్యసేన్‌, రాజవత్‌లు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా.. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌-త్రిసా జాలీ ద్వయం తొలి మ్యాచ్‌లోనే ఇంటి బాట పట్టారు. ఇప్పుడు తాజాగా పురుషుల డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టిలు సైతం తొలి రౌండ్‌లోనే తమ పోరాటాన్ని ముగించారు.

బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ సాత్విక్‌-చిరాగ్‌ ద్వయం 17-21, 21-11, 17-21 తేడాతో మలేసియాకు చెందిన మహ్మద్‌ శోహిబుల్‌ ఫిక్రీ-మౌలానా బాగస్‌ జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు. రెండో గేమ్‌లో గెలిచి మ్యాచ్‌లో నిలిచిన భారత జంట మూడో రౌండ్‌లో మాత్రం మరోసారి తడబడింది.

- Advertisement -

దీంతో చివర్లో పుంజుకున్న మలేసియా ద్వయం భారీ స్మాష్‌లతో భారత జోడీపై విజయం సాధించి టోర్నీలో ముందంజ వేశారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-రోహన్‌ కపూర్‌ ద్వయం 15-21, 16-21 తేడాతో మలేసియాకే చెందిన చెన్‌ టాంగ్‌ జీ-తో యి వీయ్‌ చేతిలో ఓటమిపాలై తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి వైదొలిగారు. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో పర్వాలేదనిపించిన భారత షట్లర్లు చైనా ఓపెన్‌లో మాత్రం నిరాశ పరిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement