Saturday, April 27, 2024

WPL | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్‌‌సీబీ..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ 5వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ మహిళల జట్లు తలపడనున్నాయి. ఇవ్వాల (ఫిబ్రవరి 27) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. కాగా, మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గుజరాత్ జెయింట్స్ మహిళల జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగనుంది.

ఆర్‌సీబీ మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించగా, గుజరాత్ మహిళల జట్టు ఓటమిని చవిచూసింది. యూపీ వారియర్స్‌తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో గెలుపొందిన రాయల్ ఛాలెంజర్స్.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి విజయ పరంపరను కొనసాగించాలని ఆర్సీబీ భావిస్తోంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌తో ఆర్‌సీబీపై గెలిచి ఖాతా తెరవాలని గుజరాత్ భావిస్తోంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంచనా జ‌ట్టు

స్మృతి మంధాన (c), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (WK), సోఫీ మోలినెక్స్, జార్జియా వేర్‌హామ్, శ్రేయంక పాటిల్, సిమ్రాన్ బహదూర్, శోభనా ఆశా, రేణుకా ఠాకూర్ సింగ్

గుజరాత్ జెయింట్స్ అంచనా జ‌ట్టు

- Advertisement -

బెత్ మూనీ (c & wk), వేద కృష్ణమూర్తి, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్, దయాళన్ హేమలత, స్నేహ రాణా, తనూజా కన్వర్, క్యాథరిన్ బ్రైస్, లీ తహుహు, మేఘనా సింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement