Friday, May 3, 2024

ప్ర‌పంచ టెస్ట్ చాంపియ‌న్ ఫైన‌ల్స్ జ‌ట్టులో ఇషాన్ కిష‌న్…

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్ జ‌ట్టులో ఇషాన్ కిషాన్ కు చోటు ద‌క్కింది.. ఈ ఫైన‌ల్ మ్యాచ్ కోసం భార‌త్ జ‌ట్టుకి ఎంపికైన కె ఎల్ రాహుల్ గాయం కార‌ణంగా దూరం కావ‌డంతో ఆత‌డి స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను తీసుకున్నారు… ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. కాగా,ఇటీవల ఐపీఎల్‌లో ఆర్సీబీతో తొడ గాయానికి గురైన లఖ్‌నవూ కెప్టెన్‌ రాహుల్ ఈ సీజన్‌లో మిగతా మ్యాచ్‌లకూ దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు స్వల్ప గాయాలైన ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌ విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధికారులు తెలిపారు. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ వచ్చే నెల 7న లండన్‌లోని ఓవల్‌లో మొదలుకానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement