Saturday, May 11, 2024

మహిళల టి 20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో భారత్‌ తొలిమ్యాచ్‌

మహిళల టి 20 ప్రపంచకప్‌లో భాగంగా వచ్చే సంవత్సరం జనవరి 14న బెనోనిలోని విల్లమూర్‌ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో భారత్‌ తన ప్రారంభ మ్యాచ్‌ను ఆడనుంది. దక్షిణాఫ్రికా, యుఏఇ స్కాట్‌ లాండ్‌లతో పాటు భారత జట్టు గ్రూప్‌ డిలో ఉంది.
దక్షిణాఫ్రికాలో జరుగనున్న ఐసిసి అండర్‌ 19 మహిళల టి 20 ప్రపంచకప్‌ ప్రారంభ ఎడిషన్‌కు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐ సి సి)శుక్రవారం ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌ వచ్చే సంవత్సరం జనవరి 14న ప్రారంభం కానుంది. ఫైనల్‌ జనవరి 29 2023న జరుగనుంది.

గ్రూప్‌ ఎ: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, యుఎస్‌ఏ,
గ్రూప్‌ బి: ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ , జింబాబ్వే, రువాండ
గ్రూప్‌ సి: ఐర్లాండ్‌, ఇండోనేషియా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌
గ్రూప్‌ డి: భారత్‌, దక్షిణాఫ్రికా, యూఏఈ, స్కాట్లండ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement