Saturday, May 4, 2024

IND vs NZ, ICC World Cup: భార‌త్ టార్గెట్ 274 ప‌రుగులు

ICC ODI వరల్డ్ కప్ 2023 టేబుల్ టాపర్ మ్యాచ్ లో న్యూజిలాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టిన న్యూజిలాండ్ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 273 ప‌రుగులకు ఆలౌట్ అయ్యింది.

న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు డ్యారీ మిట్చెల్ 130 ప‌రుగులు, ర‌చిన్ ర‌వీంద్ర 75 ప‌రుగులు, గ్లెన్ ఫిలిప్స్ 23 ప‌రుగులు చేశారు. భార‌త్ బౌల‌ర్లు మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ నాలుగు వికెట్లు, కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు, జ‌స్ప్రీత్ బుమ్రా, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ లు చెరొక వికెట్లు తీశారు. భార‌త్ జ‌ట్టు విజ‌య‌ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 274 ప‌రుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement