Sunday, April 28, 2024

Ind vs Eng, 4th Test : ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్..

రాంచీ మైదానం వేదికగా టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ తీసుకుంది. తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్ దీప్ వేసే బంతులకు ఇంగ్లండ్ బ్యాటర్లు తట్టుకోలేకపోతున్నారు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయారు.

డకెట్ 11 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆతర్వాత 4వ ఓవర్ లో బౌల్డయినా నోబాల్ తో తప్పించుకున్న క్రాలే(42), ఈ సారీ ఆకాశ్ ధాటికి నిలవలేదు. 11.5 వద్ద అతడు వేసిన అద్భుతమైన బంతికి మరోసారి క్లీన్ బౌల్డ్ అయ్యారు. క్రీజులోకి బెయిర్ స్టో వచ్చాడు. ఇంగ్లండ్ ప్రస్తుతం మూడు వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement