వెస్టిండీస్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా లాస్ట్ మ్యాచ్లో టీమిండియా మేనేజ్మెంట్ కెప్టెన్ రోహిత్ సహా కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చింది. దీంతో టాస్ కార్యక్రమానికి ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా అటెండ్ అయ్యాడు. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు పాండ్యా. రోహిత్తోపాటు రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్, సూర్యకుమార్ యాదవ్కు విశ్రాంతి ఇచ్చినట్లు పాండ్యా చెప్పాడు.
భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్
- Advertisement -