Friday, May 17, 2024

హైద‌రాబాద్ బిరియాని ఎంత పని చేసింది… వరుసగా రెండు మ్యాచ్ లలో పాక్ ఓటమి..

హైద‌రాబాద్ – వన్డే ప్రపంచ కప్‌ కోసం ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగు పెట్టిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది. మరో రెండు ప్రధాన మ్యాచ్‌లను కూడా ఇక్కడే ఆడనుంది. చాలా ఏళ్ల తర్వాత మన దేశానికి వచ్చిన పాకిస్థాన్ క్రికెటర్లకు హైదరాబాద్‌లో అద్భుత ఆతిథ్యం లభిస్తోంది. నగరంలో అగ్ర హోటళ్లలో ఒకటైన పార్క్‌ హయత్‌లో పాక్‌ క్రికెటర్లకు బస ఏర్పాటు చేశారు. అక్కడ దాయాది జట్టు ఆటగాళ్లకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రపంచంలోనే ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీ పాక్‌ ఆటగాళ్లకు మరింత నచ్చింది. దీంతో లొట్ట‌లేసుకుంటూ తినేస్తున్నారు..

దాంతో రోజూ బిర్యానీ లాగిస్తున్నామని పాకిస్థాన్ వైస్‌ కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్ కూడా దృవీక‌రించాడు.. బిరియానీ అధికంగా తిన‌డంతో మైదానంలో తాము అంత చరుగ్గా ఉండలేకపోతున్నామని తెలిపాడు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు పలు క్యాచ్‌లను వదిలేయడంతో పాటు మిస్‌ ఫీల్డ్‌ చేశారు. ఈ రెండు మ్యాచ్ లోనూ పాక్ ఓట‌మి పొందింది. త‌మ జ‌ట్టు రెండు వ‌రుస ఓట‌ముల‌కు హైద‌రాబాద్ బిరియాని కార‌ణమంటూ షాదాబ్ పేర్కొన్నాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement