Sunday, April 28, 2024

IPL : నేడు గుజ‌రాత్ తో ఢిల్లీ ఢీ…

ఐపీఎల్ లో మ్యాచ్‌లు అన్నీ రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకూ ఏ మ్యాచ్ కూడా బోరు కొట్టిన పరిస్థితి లేదు. మండు వేసవిలో క్రికెట్ ఫ్యాన్స్ ను ఐపీఎల్ సంతోషంగా ఉంచుతుంది. రికార్డులు బ్రేక్ లు అవుతున్నాయి. సిక్స్‌లు, ఫోర్లతో స్టేడియాలు మార్మోగుతున్నాయి.

- Advertisement -

అలాంటి ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు… నేడు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ కాపిటల్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.

ఇక ఐపీఎల్ 2024 లో భాగంగా ఇవాళ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మూడు మ్యాచులు జరగ్గా.. గుజరాత్‌దే పైచేయిగా ఉంది. గుజరాత్ రెండింట్లో, ఢిల్లీ ఒక మ్యాచులో విజయం సాధించాయి. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో గుజరాత్ 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. ఢిల్లీ నాలుగు పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.

ఢిల్లీ కాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నప్పటికీ అది వేగంగా పుంజుకుంటుందని దాని అభిమానులు ఆశతో ఉన్నారు. అలాగే గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలంగా ఉంది.. ఈ మ్యాచ్ లో ఇటు రిష‌బ్ పంత్ కు, అటు శుభమ్ గిల్ కు పెను స‌వాలే.

Advertisement

తాజా వార్తలు

Advertisement