Saturday, July 27, 2024

Sports | బాక్సింగ్ లో భారత్‌కు స్వర్ణం

స్టాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్‌ ఫైనల్లో.. భారత్ స్వర్ణం సాధించింది. ఇవ్వాల (ఆదివారం) జరిగిన పురుషుల 51 కేజీల విభాగంలో అమిత్ పంఘల్ 5-0 తేడాతో కజకిస్థాన్‌కు చెందిన సంజార్ తష్కెన్‌బేపై విజయం సాధించాడు.

మరోవైపు భార‌త బాక్సర్ నిఖత్ జరీన్ ఓటమిపాలైంది. మహిళల 50 కేజీల ఫైనల్‌ ఉజ్బెకిస్థాన్ క్రీడాకారిణి సబీనా బొబోకులోవాతో తలపడిన నిఖత్ 2-3 తేడాతో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది నిఖత్.

సెమీఫైనల్ మ్యాచ్ లో స్లొవేకియాకు చెందిన జెస్సికా ట్రిబెలోవాపై 5-0 తేడాతో విజయం సాధించిన అరుంధతీ చౌదరి.. మహిళల 66 కేజీల విభాగం ఫైనల్‌లో ప్రపంచ ఛాంపియన్ చైనాకు చెందిన లియు యాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-4 తేడాతో ఓడిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement