Sunday, October 20, 2024

Singapore Open | సెమీస్‌లో గాయత్రి జోడీ..

భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీలు సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో అదరగొడుతున్నారు. ప్రి క్వార్టర్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ జంటకి షాకిచ్చిన వీరు.. క్వార్టర్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ దక్షిణ కొరియా ద్వయంపై సంచలన విజయం సాధించి సెమీస్‌లో దూసుకెళ్లారు.

శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ పోరులో గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ జోడీ 18-21, 21-19, 24-22 తేడాతో కిమ్‌ సొ యియోంగ్‌-కాంగ్‌ హీ యాంగ్‌ (దక్షిణ కొరియా)ను ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ గంట 19 నిమిషాల్లో కొరియా షట్లర్లను చిత్తు చేసి టోర్నీలో ముందంజ వేశారు. ఇక శనివారం జరిగే సెమీస్‌ పోరులో గాయత్రి జోడీ నాలుగో సీడ్‌ జపాన్‌ జంటతో తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement