Friday, May 3, 2024

ఫుట్‌బాల్‌ దిగ్గజం సమర్‌ బెనర్జీ కన్నుమూత

ప్రముఖ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌, భారత జట్టు మాజీ కెప్టెన్‌ సమర్‌ బెనర్జీ (92) తుది శ్వాస విడిచారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోనే ఎస్‌ఎస్‌కెఎమ్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
క్రీడారంగంలో అందరికీ సుపరిచితులుగా ఉన్న ఆయన 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు ప్రాతినిద్యం వహించారు. అందులో భారత్‌ నాలుగో స్థానం దక్కింది. అలాగే ప్రముఖ ఫుట్‌బాల్‌ క్లబ్‌ మోహన్‌ బగన్‌కు ఏడు సంవత్సరాలు ప్రాతినిద్యం వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement