Friday, May 3, 2024

China : థామస్ , ఉబర్‌కప్‌ టోర్నీలో భార‌త్ బోణి….

ప్రతిష్ఠాత్మక థామస్‌ కప్‌, ఉబర్‌కప్‌ టోర్నీలో భారత్‌ అదిరిపోయే బోణీ కొట్టింది. గ‌త రాత్రి జరిగిన ఉబర్‌ కప్‌ తొలి పోరులో భారత్‌ 4-1 తేడాతో కెనడాపై అద్భుత విజయం సాధించింది. తొలుత జరిగిన మహిళల సింగిల్స్‌ పోరులో యువ షట్లర్‌ అశ్మిత చాలిహా 26-24, 24-22తో మిచెల్లీ లీపై సంచలన విజయం సాధించింది…

- Advertisement -

42 నిమిషాల్లో ముగిసిన పోరులో తన(53 ర్యాంక్‌) కంటే మెరుగైన ర్యాంక్‌లో మిచెల్లీ(25)కి అశ్మిత ఊహించని షాక్‌ ఇచ్చింది. మహిళల డబుల్స్‌లో ప్రియ, శృతి జోడీ 21-12, 21-10తో క్యాథరిన్‌, జెస్లిన్‌ ద్వయంపై గెలిచింది. మరో సింగిల్స్‌లో ఇష్రాని బారుహ్‌ 21-13, 21-12తో వెన్‌ యు జాంగ్‌పై గెలువడంతో భారత్‌ ఆధిక్యం 3-0కు చేరుకుంది.
పురుషుల విభాగంలో భారత్‌ 4-1తో థాయ్‌లాండ్‌పై విజయం సాధించింది. సింగిల్స్‌లో ప్రణయ్‌ మినహా అందరూ గెలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement