Thursday, May 2, 2024

AUS vs ENG: ఇంగ్లండ్ టార్గెట్ 287 పరుగులు

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ కప్ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేపట్టింది. ఆసీస్ బ్యాటర్లు లబూషేన్ 71 పరుగులు, కామెరున్ గ్రీన్ 47 పరుగులు, స్టీవెన్ స్మిత్ 44 పరుగులు, స్టోయినిస్ 35 పరుగులు చేశారు. మొత్తంగా 49.3ఓవర్లలో ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యి 286 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement