Sunday, April 28, 2024

Asian Games – 25 మీట‌ర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్ట‌ల్ విభాగంలో భార‌త్ కు కాంస్య ప‌త‌కం

చైనాలో జ‌రుగుతున్న అసియ‌న్ గేమ్స్ లో భార‌త్ షూట‌ర్స్ మరో మెడ‌ల్ సాధించారు.. నేడు జ‌రిగిన 25 మీట‌ర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్ట‌ల్ విభాగంలో పురుషుల జ‌ట్టు కాంస్య ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకుంది..ఆద‌ర్స్ సింగ్, అవినాష్, విజ‌య్ వీర్ సిద్దూతో కూడిన భార‌త్ జ‌ట్టు ఈ విభాగంలో మూడో స్థానంలో నిలిచింది.. దీంతో బ్రోంజ్ మెడ‌ల్ ద‌క్కించుకుంది.. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ విభాగంలో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు ప‌త‌కాల‌ను కైవ‌సం చేసుకుంది.. వాటిలో ఒక గోల్డ్, ఒక వెండి, రెండు కాంస్య ప‌త‌కాలున్నాయి..

ఇక రోయింగ్ విభాగంలో నిన్న మూడు ప‌త‌కాలు సాధించిన ఇండియా నేడు మ‌రో ప‌త‌కం కైవ‌సం చేసుకుంది.. ఈ విభాగంలో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు మెడ‌ల్స్ సాధించగా వాటిలో రెండు వెండి, రెండు కాంస్య ప‌త‌కాలున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement