Saturday, May 4, 2024

అశ్విన్ అరుదైన రికార్డు.. 500 వికెట్ల క్ల‌బ్‌లో చోటు

రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన రికార్డును అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ఆట‌గాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. భార‌త్ త‌రుపున ఈ ఘ‌న‌త సాధించిన రెండో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఓవ‌రాల్‌గా తొమ్మిదో ఆట‌గాడిగా నిలిచాడు. రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్‌తో తన 98వ టెస్ట్ మ్మాచ్ ఆడుతున్న అశ్విన్ ఇంగ్లాండ్ ఓపెన‌ర్ జాక్ క్రాలీ(15)ని ఔట్ చేయ‌డం ద్వారా అశ్విన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.

టెస్టు క్రికెట్‌లో 500 పైగా వికెట్లు తీసిన ఆట‌గాళ్లు వీరే..

ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ (శ్రీలంక‌) – 800 వికెట్లు
షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 708
జేమ్స్ అండ‌ర్స‌న్ (ఇంగ్లాండ్‌) – 696*
అనిల్ కుంబ్లే (భార‌త్‌) – 619
స్టువ‌ర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్‌) – 604
గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) – 563
కోర్ట్నీ ఆండ్రూ వాల్ష్ (వెస్టిండీస్‌) – 519
నాథ‌న్ ల‌య‌న్ (ఆస్ట్రేలియా) – 517*
ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్‌) – 500*

Advertisement

తాజా వార్తలు

Advertisement