Sunday, May 19, 2024

Yashoda Hospital | ‘కేసీఆర్’ని పరామర్శించిన చిరంజీవి.. !

సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు పరామ‌ర్శిస్తున్నారు. ఇవ్వాల (సోమ‌వారం) సాయంత్రం కేసీఆర్‌ను సినీ న‌టుడు చిరంజీవి ప‌రామ‌ర్శించారు. కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితిని డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని చిరంజీవి ఆకాంక్షించారు.

సోమ‌వారం సాయంత్రం ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌తో పాటు ప‌లువురు నాయ‌కులు కేసీఆర్‌ను ప‌రామ‌ర్శించారు. ఇవాళ మ‌ధ్యాహ్నం సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మోత్కుపల్లి న‌ర్సింహులు, బీఆర్ఎస్ నాయ‌కుడు చల్మడ లక్ష్మి నరసింహారావు తదితరులు కేసీఆర్‌ను ప‌రామ‌ర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement