పూరీ – ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో మట్టితో 15 అడుగుల ఎత్తున్న పులి బొమ్మను రూపొందించారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. తల్లి పులి తన పిల్లను ప్రేమతో నిమురుతున్నట్లుగా ఈ చిత్రాన్ని తయారు చేశారు. పర్యావరణాన్ని కాపాడాలంటే అడవుల్లో ఉండే తమను రక్షించండి అంటూ జనారణ్యంలో ఉండే జనాలకు పులులు చెబుతున్నట్లుగా ఈ సైకత శిల్పాన్ని ఆయన చెక్కారు.
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉన్న పులుల జనాభా క్రమంగా తగ్గిపోతున్నది. దీంతో పులులను రక్షించుకోవాలనే ఉద్దేశంతో 2010 నుంచి ప్రతిఏటా జూలై 29ని ప్రపంచ పులులు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు..
On #InternationalTigerDay My 15ft long sand tiger with message "Save us To Save the Environment " at Puri beach in Odisha. pic.twitter.com/7FmIsQgS0o
— Sudarsan Pattnaik (@sudarsansand) July 29, 2023