Friday, May 17, 2024

World Lion Day – రాబోయే త‌రాల కోసం సింహ‌ల‌ను సంర‌క్షించండి – మోడీ

న్యూఢిల్లీ – ఆగస్టు 10న ‘ప్రపంచ సింహాల దినోత్సవం’ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజును ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. . ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. కొన్న ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ”ప్రపంచ సింహల దినోత్సవం.. వాటి శక్తి, గాంభీర్యంతో మన హృదయాలను దోచుకునే గంభీరమైన సింహాలను జరుపుకునే సందర్భం. భారతదేశం ఆసియాటిక్ సింహాలకు నిలయంగా ఉన్నందుకు గర్విస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో సింహాల జనాభా స్థిరంగా పెరుగుతోంది. సింహాల ఆవాసాలను కాపాడేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను. మనం వాటిని రక్షిస్తూ.. రాబోయే తరాలకు అందుబాటులో ఉండేలా చూడాలి. అవి అభివృద్ధి చెందుతూనే ఉండాలి” అని ప్రధాని మోడీ ట్వీట్ లో పేర్కొన్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement