Friday, May 3, 2024

ఉక్రెయిన్‌కు సాయం చేస్తూనే ఉంటాం.. ఐక్యరాజ్య సమితిలో భారత్‌ స్పష్టీకరణ

ఉక్రెయిన్‌లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని, మానవ సంక్షోభం అంచుల్లోకి వెళ్తున్నదని, తాము మాత్రం ఉక్రెయిన్‌కు సాయం అందిస్తూనే ఉంటామని ఐక్యరాజ్య సమితిలో భారత్‌ స్పష్టం చేసింది. భద్రతా మండలిలో ఇండియా తరఫున ప్రాతినిథ్యం వహించిన టీఎస్‌ తిరుమూర్తి మాట్లాడారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులు చేయి దాటిపోకుండా ప్రపంచ దేశాలు వెంటనే సిద్ధం కావాలని కోరారు. ఉక్రెయిన్‌లో బాంబులు, క్షిపణుల దాడికి బలైన ముప్పు ఎదుర్కొంటున్న కుటుంబాల కోసం అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మానవతం, తటస్థం, నిష్పక్షపాతం, సేచ్చ ప్రాతిపదికన ఉక్రెయిన్‌లో ప్రజలకు సహకరించి వారిని ముప్పు నుంచి కాపాడుకోవాలని అన్నారు. ఈ చర్యలను రాజకీయ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అమాయక ప్రజలు చనిపోతున్నారని, శరణార్థులు, నిరాశ్రయులుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాంబులు పడుతున్న ప్రాంతాల్లో.. మానవ జీవన స్థితిగతులు క్షీణించిపోతున్నాయని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement