Friday, May 17, 2024

ఏపీలో వాలంటీర్ దారుణహత్య

అనంతపురం జిల్లాలో వాలంటీర్ దారుణహత్య స్థానికంగా కలకలం రేపింది. కూడేరు మండలం శివరాంపేట గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వాలంటీర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. శుక్రవార అర్ధరాత్రి పొలం వద్ద నిద్రిస్తున్న సమయంలో గునపంతో పొడిచి వాలంటీర్‌ను చంపేశారు. దీంతో అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు చూసి వాలంటీర్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే శ్రీకాంత్ తండ్రిని చంపబోయి దుండగులు శ్రీకాంత్‌ను చంపినట్లు కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. కాగా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాంత్ మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement