Friday, April 26, 2024

ప‌రశురామ్ తో రెండోసారి.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌

ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్ లో రెండోసారి న‌టించ‌నున్నారు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. వీరి కాంబినేషన్ లో గీత గోవిందమ్ మొదటి సినిమా కాగా, ఇది రెండో ప్రాజెక్ట్ అవుతుంది. దీంతో సహజంగానే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి విజయ్ దేవరకొండ ప్రకటించాడు. వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇది గీత గోవిందమ్ కు సీక్వెల్ కాదని, తాజా స్క్రిప్ట్ తోనే ఉంటుందని నిర్మాతలు స్పష్టం చేశారు. పెద్ద బడ్జెట్ తోనే ఈ సినిమాని తీయనున్నట్టు తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ సినిమా కోసం ప్రస్తుతం విజయ్ దేవరకొండ పనిచేస్తున్నాడు. ఇందులో విజయ్ సరసన సమంత నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement