Wednesday, May 1, 2024

Jammu: లోయ‌లో ప‌డ్డ వాహ‌నం… 8మంది మృత్యువాత‌

జ‌మ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలోని బుజ్తలా బొనియార్‌ ప్రాంతం వద్ద ప్ర‌యాణీకుల వాహ‌నం లోయ‌లో ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 8మంది మృత్యువాత ప‌డ్డారు. మ‌రో ఏడుగురికి తీవ్ర గాయాల‌య్యాయి.

గాయ‌ప‌డిన వారిని స్థానికుల సాయంతో పోలీసులు స‌మీప ఆసుప‌త్రికి చికిత్స నిమిత్తం త‌ర‌లించారు. కిష్త్వార్‌లోని మార్వాన్ ప్రాంతంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పనుల్లో ఉన్న స్నో కట్టర్‌ మిషన్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. చాలా మంది గాయపడ్డారు. బారాముల్లా, కిష్త్వార్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement