Sunday, April 28, 2024

National : లోయ‌లో ప‌డ్డ వాహ‌నం… 8మంది మృతి

ఉత్తరాఖండ్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉగాది పర్వదినాన వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో 8మంది మృతి చెందారు.

- Advertisement -

ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లాలోని బేతాల్‌ఘాట్ ప్రాంతంలో వాహనం లోయలో పడింది. వాహనం లోయలో పడటంతో ఎనిమిది మంది మృతి చెందటంతో పాటు, పలువురికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రదేశం నైనిటాల్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 60కి.మీ దూరంలో ఉందని పోలీసులు తెలిపారు. మృతులు అందరూ బేతాల్‌ఘాట్‌లోని ఉంచకోట్ గ్రామంలో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement