Friday, May 3, 2024

Uttar Pradesh – బిజేపీ లోక్‌సభ అభ్యర్థి గుండె పోటుతో కన్నుమూత

బిజేపీ లోక్‌సభ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ (72) హఠాన్మరణం చెందారు. పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం దేశ వ్యాప్తంగా తొలి విడత పోలింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సర్వేష్ సింగ్ బరిలో ఉన్నారు. శుక్రవారం జరిగిన పోలింగ్‌లో ఆయన ఓటు కూడా వేశారు. అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోకి ఎయిమ్స్‌కు తరలించారు. అనంతరం ఆయన గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement