Sunday, April 28, 2024

TS | భట్టి మీటింగులో కరెంట్ కట్.. ఉప ముఖ్యమంత్రి వీడియో వైరల్

తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పాల్గొన్న ఓ మీటింగ్‌లో కరెంటు పోయింది. దీంతో దాదాపు 20 నిమిషాల పాటు ఆయన చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆయన శనివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వీరు సమావేశమైన కాసేపటికే ఆ ప్రాంతంలో కరెంటు పోయింది.

కాసేపటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో కరెంట్ వచ్చినప్పటికీ… సీపీఐ కార్యాలయంలో మాత్రం రాలేదు. దీంతో భట్టివిక్రమార్క సహా సీపీఐ నేతలు కాసేపు చీకట్లో గడపాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement