Wednesday, May 1, 2024

బాసర అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి అర్చకులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి తీర్థ ప్రసాదం, అమ్మవారి శేష వస్త్రాన్ని అందించి ఆశీర్వదించారు. వీరి వెంట స్థానిక నిర్మల్ జిల్లా అధ్యక్షులు పడకండి రమాదేవి, బీజేపీ నాయకులు రామారావు పటేల్, స్థానిక బాసర బిజెపి నాయకులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement