Friday, May 17, 2024

అమరావతిలో వెంటనే నిర్మాణాలు చేపట్టండి : సమితి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అమరావతి రాజధానిలో ఆర్ధిక శాఖలకు సంబంధించిన సంస్థల నిర్మాణాలను వెంటనే చేపట్టవలసిందిగా అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు సమితి నేతలు శివారెడ్డి తిరుపతి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు బొల్లినేని రామారావు ఆధ్వర్యంలో మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ సహాయ మంత్రి భాగవత్ కరాడ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

అనంతరం వారు ప్రముఖ న్యాయవాది వినోద్ శ్యామ్ దివాన్‌ను కలిశారు. మూడు రాజధానుల అంశం పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో తన వాదనను ను వినిపించి అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని తీర్పు వచ్చే విధంగా కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement