Thursday, May 2, 2024

ఉత్తర్ ప్రదేశ్ లో ‘‘గిఫ్ట్ ఏ స్మైల్’’.. కేటీఆర్​ బర్త్​డే సందర్భంగా యాచకులకు గొడుగుల పంపిణీ

మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజును పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో వీధి యాచకులకు వర్షకాలం సందర్భంగా టీఆర్ ఎస్‌ నాయకులు గొడుగులు పంపిణి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు, కరీంనగర్ టీఆర్ ఎస్ నాయకుడు నగునూరి రాజేందర్ ఆధ్వర్యంలో ఆదివారం గొడుగులు పంపిణీ చేశారు.

ఈ సందర్భముగా నగునూరి రాజేందర్ మాట్లాడుతూ ఐవీఫ్ జాతీయ సమావేశాల సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ లోని బృందావనం లో ఉన్నందున ఇక్కడ వీధుల్లో భిక్షాటన చేస్తున్న వారికి గొడుగులు అంద‌జేసిన‌ట్టు తెలిపారు. కార్యక్రమంలో బిజ్జాల నవీన్, తొడుపునురి హరి ప్రసాద్, కోలుపురి నరేష్ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement