Friday, May 3, 2024

TS | ఏపీలో ఎన్నికలకు వెళ్లేవారికి TSRTC స్పెషల్ బస్సులు…

ఏపీకి చెందిన చాలా మంది ఉపాధి నిమిత్తం తెలంగాణకు వచ్చారు. పై చదువులు చదవే విద్యార్థులు మెుదలుకొని ఐటీ ఉద్యోగులు, వ్యాపారాలు చేసుకునేందుకు చాలా మంది ఏపీవాసులు తెలంగాణలో నివాసం ఉంటున్నారు. అయితే వీరంతా ఓటేసేందుకు స్వస్థలాకు పయనం అవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ఓటర్లకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఏపీకి అదనంగా బస్సులు నడిపించాలని నిర్ణయించింది.

మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. దీనికి ముందు 11, 12 శని, ఆదివారాలు కావడంతో టికెట్ల బుకింగ్‌కు డిమాండ్‌ ఏర్పడింది. దీంతో తొలి దశలో కనీసం 50 ప్రత్యేక బస్సుల్ని రిజర్వేషన్‌లో పెట్టాలని, మరిన్ని ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్‌ఆర్టీసీ భావిస్తోంది. ఆర్టీసీ నిర్ణయం పట్ల ఏపీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement