Tuesday, April 30, 2024

TS : ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కీల‌క స‌మావేశం

ఇవాళ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారు. ఈ భేటీలో ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్‌ బీ ఫారాలు అందజేయనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రూ.95 లక్షల విలువైన చెక్కులు ఇవ్వనున్నారు.

- Advertisement -

బీ ఫారాల అందజేత తర్వాత కేసీఆర్ పార్టీ నేతలతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై అభ్యర్థులకు గులాబీ బాస్ దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోనూ కేసీఆర్ భేటీ కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement