Friday, May 10, 2024

సాంకేతిక లోపంతో నిలిచిన రైలు-ఇబ్బందుల‌కి గుర‌యిన ప్ర‌యాణికులు

సాంకేతిక కార‌ణంతో న‌ర‌సాపురం-ధ‌ర్మ‌వ‌రం రైలు ఆగిపోయింది. అన్నమయ్య జిల్లా కురబలకోట – తుమ్మలకుంట మధ్య రైలు ఆగిపోయింది. గంటల తరబడి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే సమాచారం అందుకున్న అధికారులు రైలును తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో ఇంజిన్‌ సహాయంతో తరలించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. రైలు ఆగిపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement