Sunday, May 19, 2024

రేపు అంతర్జాతీయ పులుల దినోత్సవం..

అమరావతి, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా రేపు (శుక్రవారం) తిరుపతి వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో రాష్ట్ర స్థాయి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు. ఈమేరకు తన క్యాంప్‌ కార్యాలయం నుండి ఆయనొక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకోవటం ఒక ఆనవాతీగా వస్తోందన్నారు.

పర్యావరణ పరిరక్షణలో పులుల ప్రాముఖ్యతను గుర్తించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంతతిని పెంచడానికి, వాటి సంరక్షణకు రాష్ట్ర అటవీ శాఖకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అంతేకాకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వస్తోందన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement