Sunday, April 28, 2024

Haryana: కాల్పులు జరిపిన దుండగులు… చీపురు క‌ట్ట‌ల‌తో పొట్టుపొట్టుకొట్టి త‌రిమిన మ‌హిళ‌లు

ఇంటి బయట నిల్చున్న వ్యక్తిపై బైక్‌పై వచ్చి దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అతడు అతడి కష్టంమీద వారి నుంచి తప్పించుకుని ఇంట్లోకి పరిగెత్తాడు. ఈ క్రమంలో కొన్ని తూటాలు అతడి శరీరంలో దిగబడ్డాయి. కాల్పుల శబ్దం విన్న పొరుగింటి మహిళ పొడవాటి చీపురుకర్రతో బయటకు వచ్చి దుండగులవైపు దూసుకెళ్లింది.

ఆమెను అడ్డుకునేందుకు కాల్పులు జరిపినా సరే ఆమె వెరవలేదు. చివరికి దుండగులు పారిపోక తప్పలేదు. హర్యానాలోని భివానీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాధితుడిని హరికిషన్‌గా పోలీసులు గుర్తించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో అతడికి సంబంధం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఓ హత్య కేసు నిందితుడైన హరికిషన్ ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నాడు. దుండగుల కాల్పుల్లో గాయపడిన హరికిషన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement